మెగా హీరో గా ఇంస్ట్రీ లోకి వచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్.. మొదట్లో ఆటుపోట్లు తిన్నా ఇప్పుడు వరుస హిట్లతో పాటు సినిమాల ఎంపిక లోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.. వరుసగా 9 సినిమాల ఫ్లాప్ ల తర్వాత చిత్ర లహరి సినిమా తో తన ఫ్లాప్ ల పరంపరకు బ్రేక్ వేశాడు.. ఒకరకంగా ఈ సినిమా తేజు కు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది అని చెప్పుకోవాలి.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సైతం సక్సెస్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ కావడంతో యూత్ ఈ సినిమా కి బాగ్ కనెక్ట్ అయ్యింది.. వరుసగా అన్ని ఫ్లాప్ లు అనేసరికి తేజ్ చాలా కృంగిపోయాడని అప్పట్లో మెగా కాంపౌండ్ వాపోయింది.

సినిమా తర్వాత మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజు పండగ సినిమా నిజంగానే సాయి తేజ్ కి పండగలాంటి సినిమా అని చెప్పొచ్చు.. ఈ సినిమా తో బ్యాక్ టూ బ్యాక్ హిట్ లు కొట్టి పోయిన ఇమేజ్ ని దక్కించుకున్నాడు. ఇలా వరుస హిట్ల తో దూసుకుపోతున్న మెగా హీరో సాయి ధరమ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా లో నటిస్తున్నాడు.. డిసెంబర్ 25 న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.  లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అవుతున్న తొలి టాలీవుడ్ సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. ఇక ఈ సినిమా తర్వాత తేజ్ చేస్తున్న సినిమాల లిస్ట్ ఎంతో ఆసక్తి కరంగా ఉంది.

దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్న సాయి ధరమ్ తేజ్మూవీ ద్వారా బలమైన సందేశాన్ని కూడా అందించబోతున్నారు. ఇందులో సాయిధరమ్ తేజ్ పాత్ర చాలా కొత్తగా పరిణతితో వుంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి `రిపబ్లిక్` అనే టైటిల్ని అనుకుంటున్నారట. అంతేకాకుండా కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరం తేజ్ మరో చిత్రం చేయబోతున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది. ఈ మూవీ కూడా కొత్త నేపథ్యంలో వుంటుందని తెలిసింది. సుకుమార్ శిష్యుడు ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం..


మరింత సమాచారం తెలుసుకోండి: