రెబల్ స్టార్ ప్రభాస్ కు బాహుబలి ఇచ్చిన బూస్ట్ తో భారీ సినిమాలతో రాకెట్ స్పీడుతో దూసుకు పోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమా కబురు వింటే చాలు అభిమానుల కళ్లలో వేయి దీపాలు ఒక్క సారిగా వెలుగుతున్నాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమా "సలార్" అప్ డేట్ కోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.
ప్రస్తుతం 'రాధేశ్యామ్' షూటింగ్ తో బిజీగా ఉన్నారు ప్రభాస్.
'బాహుబలి’, ‘సాహో’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ తాజా చిత్రం ‘రాధే శ్యామ్‌’... ఈ చిత్రాన్ని  ఎంతో వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాధాకృష్ణ.

అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రశాంత్ దర్శకత్వంలో 'సలార్' సినిమా లో నటించేందుకు ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సినిమా జనవరిలో మొదలు పెట్టబోతున్నట్లుగా క్లారిటీ ఇవ్వడంతో.... "సలార్" సినిమా అప్ డేట్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్ర అప్ డేట్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారేమోనని  ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. మరి అభిమానులు కోరిక మేరకు సలార్ మూవీ అప్డేట్ విడుదల అవుతుందేమో చూడాలి. మరోవైపు ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమా చిత్రీకరణ లో బిజీగా ఉన్నారు  ప్రశాంత్ నీల్. ఈ సినిమా షూటింగ్ విషయంలో కాస్త ఆలస్యం అవుతున్న కారణం గానే సలార్ షూటింగ్ అప్ డేట్ విషయం లేట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. మరి ఇంతకీ ఈ సంక్రాంతికి సలార్ అప్డేట్ వచ్చి   సందడి చేస్తుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: