టాలీవుడ్ పాపులర్ సింగర్ సునీత ఇటీవలె రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. అప్పటినుంచి ఈమె తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయారు. ప్రతి ఒక్కరూ ఆమె రెండో వివాహం గురించి మాట్లాడుతున్నారు. అందులో కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ హీరోయిన్ రోజా.. సునీత వెడ్డింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో గాయని సునీత వివాహం సెట్ అయింది. కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో రహస్యంగా జరిగినప్పటికీ.. అది లీక్ అయింది.ముందుగా ఖరారు చేసిన దాని ప్రకారం..

 జనవరి 9న శనివారం సాయంత్రం మీడియా దిగ్గజం రామ్ వీరపనేనితో సింగర్ సునీత రెండో పెళ్లి జరిగింది. హిందూ సంప్రదాయ ఆచారాల మధ్య జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. ఘనంగా జరిగిన ఈ వేడుకకు చాలా తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు.సునీత రెండో పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది దీని గురించే మాట్లాడుతున్నారు. కొందరు సెలెబ్రిటీలు సైతం ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో నాగబాబు సహా కొందరు సినీ ప్రముఖులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోయిన్ రోజా.. సునీత రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడిన రోజా.. 'సునీత రెండో పెళ్లి చేసుకోవడంపై చాలా మంది విమర్శిస్తున్నారు. అసలు వాళ్లు మనుషులేనా.? ఆమెకు ఓ తోడు అవసరం ఉండదా.? అది ఆలోచించకపోతే వాళ్ల పిల్లలు దీనికి ఎందుకు ఒప్పుకున్నారు? అసలు ఈ విషయంపై ఎవరూ స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆమె వ్యక్తిగతం' అంటూ ఘాటుగా స్పందించింది రోజా...!!

మరింత సమాచారం తెలుసుకోండి: