టాలీవుడ్ సినిమా పరిశ్రమకి వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన కొత్తబంగారులోకం సినిమా ద్వారా దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన యువ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆ మూవీతో పెద్ద హిట్ అందుకున్నాడు. దాని అనంతరం సూపర్ స్టార్ మహేష్, విక్టరీ వెంకటేష్ లతో కలిసి ప్రతిష్టాత్మక సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తీసాడు శ్రీకాంత్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీ అప్పట్లో పెద్ద సక్సెస్ అందుకుంది. అంజలి, సమంత అక్కినేని హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.

మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కుటుంబ బంధాలు అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ సక్సెస్ తరువాత టాలీవుడ్ లో మెల్లగా మల్టిస్టారర్ సినిమాల రాక మొదలైంది. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో మరొక్కసారి వెంకటేష్, మహేష్ కలిసి ఒక చేయనున్నారు అనే వార్త విస్తృతంగా షికారు చేస్తోంది. ఇటీవల దర్శకుడు శ్రీకాంత్ ఈ ఇద్దరు హీరోల కోసం ఒక పవర్ఫుల్ స్టోరీ ని సిద్ధం చేసారని, అలానే ఒక భారీ నిర్మాణ సంస్థ దీనిని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించనుందని అంటున్నారు.

అయితే ఇటీవల ఇద్దరు హీరోలని కలిసిన సదరు దర్శకుడు స్టోరీని వినిపించడం, అది ఎంతో నచ్చిన వారిద్దరూ కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. అయితే ఈ సినిమాని తమ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి అయిన తరువాత చేద్దాం అని వారు మాటిచ్చినట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మరొక్కసారి మహేష్, వెంకటేష్ ల కలయికలో శ్రీకాంత అడ్డాల దర్శకత్వంలో మల్టిస్టారర్ మూవీని వెండితరపై చూడవచ్చు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: