ఎన్టీఆర్ ఈ పేరు వినగానే.. పౌరాణికం దగ్గర్నుంచి మేజర్ వరకు దాదాపు అన్ని పాత్రలు గుర్తుకువస్తుంటాయి. ఎన్టీఆర్ తర్వాత ఆయన నటవారసత్వాన్ని కొనసాగిస్తున్నది ఇద్దరే. వారే నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్. ఇక టాలీవుడ్‌లో రౌధ్రంగా గర్జించే సంభాషణలు చెప్పాలన్నా, పౌరాణిక పాత్రలు వేయాలన్నా నందమూరి బాలకృష్ణ ముందువరసలో ఉంటారు. అలాగే తాతకు తగ్గ మనవడు అన్నట్టుగా డైలాగ్ లను చెప్పడంలో రామయ్య దిట్ట అనే చెప్పుకోవాలి. ఇక వీరిద్దరి తర్వాత నందమూరి కుటుంబం నుంచి ఏ హీరోకు అంతగా క్రేజ్ లేదనుకోవచ్చు. అయితే గత కొన్నేళ్ళుగా నటసింహం వారసుడి వెండి తెర ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

 అలాగే ఎప్పటినుంచో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నాయి. ప్రముఖ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అతడిని లాంచ్ చేయబోతున్నట్లు చెప్పారు. కానీ అది కూడా ముందుకు వెళ్లలేదు. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ మోక్షజ్ఞను లాంచ్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మోక్షజ్ఞ కోసం ఈ డైరెక్టర్ స్టోరీ కూడా రెడి చేసుకున్నాడట. అయితే మోక్షజ్ఞకు సినిమాలపై ఇంట్రస్ట్ లేదని, అతడు బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. తాజాగా మొక్షజ్ఞకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

శుక్రవారం నారా, నందమూరి కుటుంబాల వంశాంకురాలు దేవాన్ష్, ఆర్యవీర్ ల అక్షరాభ్యాసం బాసరలో వైభవంగా జరిగింది. దేవాన్ష్... బాలకృష్ణ పెద్ద కుమార్తే బ్రహ్మాణి, చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ దంపతుల  కుమారుడున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్యవీర్ బాలకృష్ణ రెండవ కుమార్తే తేజస్విని కుమారుడు. ఈ కార్యక్రమంలో మోక్షజ్ఞ కూడా పాల్గొన్నాడు. ఇదే సమయంలో మోక్షజ్ఞ అభిమానుల కెమెరాలకు చిక్కారు. సహజంగా ఎప్పుడూ బయట కనిపించని మోక్షజ్ఞ చాలా రోజుల తర్వాత కెమెరాలకు చిక్కడంతో అభిమానులు తెగ షేర్ చేసేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: