​​​​శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యాడు నవీన్ పొలిశెట్టి . ఆ తర్వాత ‘డి ఫర్ దోపిడి’, మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే  సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో నవీన్ పోలీశెట్టి పేరు మారుమ్రోగిపోయింది.ఈ సినిమాలో చంటబ్బాయి తరహాలో కామెడీ ప్రైవేటు డిటెక్టివ్‌గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఇతను ‘జాతిరత్నాలు’ అనే సినిమా చేశారు. ఈసినిమాను వైజయంతీ మూవీస్ అనుబంధ సంస్థ స్వప్నా సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేసాడు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు.నవీన్ పొలిశెట్టి తో పాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలుగా రాబోతున్న ఈ చిత్రం "జాతి రత్నలు". ఈ చిత్రం మార్చి 11న గ్రాండ్ రిలీజ్ అయింది.కేవీ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇంతకు ముందు పిట్టగోడ సినిమాకు ఆయన డైరెక్షన్ చేశాడు. అయితే ఈ సినిమా విడుదల అయినప్పటి నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఈ సినిమా చూసి చాలామంది సెలెబ్రెటీస్ తమ ఆనందాన్ని తెలియజేసారు. సినిమా విడుదల రోజు అల్లు అర్జున్ సినిమా చూసి జాతి రత్నాలు టీం పొగిడారు. అయితే ఇప్పుడు యకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జాతి రత్నాలు చూసి నవీన్ పొలిశెట్టి గురించి మనకు తెలియని విషయాన్ని చెప్పారు. అదేంటి అంటే వన్ నేనొక్కడినే సినిమాలో నవీన్ చిన్న పాత్ర చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో నవీన్ ని చూసినప్పుడు మహేష్ కి అర్థం అయింది అంట తనలో మంచి నటుడు ఉన్నాడు అని. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అలాగే జాతిరత్నాలు టీం కంగ్రాట్స్ కూడా చెప్పారు.ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
https://twitter.com/urstrulyMahesh/status/1370632507079585792?s=20 

మరింత సమాచారం తెలుసుకోండి: