ఒకప్పుడు ఢీ ,
దేనికైనా రెడీ లాంటి సూపర్ హిట్స్ తో దూసుకెళ్లే మంచు విష్ణు కొన్ని రోజులు విరామం తర్వాత మంచు విష్ణు ఒక భారీ బడ్జెట్ చిత్రంతో మన ముందు రాబోతున్నాడు. మోసగాళ్ళు పేరుతో వస్తున్న ఈ చిత్రం టీజర్ కూడా ఈ మధ్యనే విడుదలైంది. ఈ సినిమాలో
బాలీవుడ్ నటుడు
సునీల్ శెట్టి పవర్ఫుల్
పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రూహీ సింగ్,
కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం,
కన్నడ,
హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగులో మోసగాళ్లుగా రాబోతున్న ఈ సినిమాకి మిగతా భాషల్లో అను అండ్
అర్జున్ పేరుతో రాబోతుంది.కాజల్ అగర్వాల్ ఇందులో మంచు విష్ణుకు సోదరిగా కనిపిస్తుండటం విశేషం.
నవీన్ చంద్ర,
నవదీప్ ప్రాధాన్య పాత్రల్లో నటిస్తున్నారు.ఇక ఈ
సినిమా ఈరోజు ఘనంగా విడుదలయ్యింది. అయితే ఈ సినిమాకి టాక్ కూడా బాగానే వినిపిస్తుంది. కాకపోతే మన తెలుగు నేటివేటి కొంచెం మిస్ అయింది అనే టాక్ అంత మిగతా అంత కూడా బాగుంది అని రివ్యూస్ వస్తున్నాయి.కొంతమంది చాలా రోజుల తర్వాత మంచు విష్ణు కి హిట్ వచ్చింది అని అని వారి రివ్యూస్ లో రాసారు. ఇక ఈ
సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి.24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు విష్ణు నిర్మించారు. ఈ సినిమాని మంచు విష్ణు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేశారు. ఈ సినిమాని విష్ణు దాదాపుగా 70 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో కథని నమ్ముకొని ఇంత ఖర్చు పెట్టాను అని ఆయన అన్నారు.అయితే చివరికి హిట్ వచ్చిందనమాట విష్ణు కి.