ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు, అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నాం అనే డైలాగ్ తో మొదలైన రిపబ్లిక్ సినిమ టీజర్ రాజకీయ నాయకులూ, లంచగొండి తనం అనే కాన్సెప్ట్ తో చిత్రం వుండబోతుందనే చెప్పకనే చెప్పేసారు. రాజకీయనాయకుల కిందే ప్రజలు, సివిల్ సర్వెంట్స్, కోర్టులు కూడా బతుకుతున్నాయని.. రూలర్స్ కింద బానిసల్లా బతుకుతున్నారని మన మెగా మేనల్లుడు చెప్పిన పవర్ ప్యాకుడ్ డైలాగ్స్ మెగా ఫాన్స్ ని పిచ్చెక్కిస్తున్నాయి.
ఇక రిపబ్లిక్ చిత్రంలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, రమ్యకృష్ణ మరియు జగపతిబాబులు సైతం కీలకమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. జూన్ 4 న ప్రేక్షకుల ముందు వస్తున్న ఈ సినిమాను ప్రస్థానం ఫెమ్ దేవా కట్టా దర్శకత్వం వహిస్తుండగా. జేబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటుంది. భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న రిపబ్లిక్ చిత్రం పై మంచి అంచనాలు కలిగి ఉన్నాయ్.