ఈ సారి కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం గట్టిగా ఉంది. మళ్ళీ లాక్ డౌన్ పెట్టడంతో అందరూ అష్టకష్టాలు పడుతున్నారు.
సినిమా ఇండస్ట్రీ కూడా ఇబ్బందుల్లో ఉంది. సెకండ్ వేవ్ వల్ల దాదాపు అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. అయితే కొన్ని సినిమాల షూటింగ్స్ మాత్రం కోవిద్ గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతున్నాయి.
సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజులు అవుతుంది. చివరి జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన
సమంత ప్రస్తుతం
శేఖర్ దర్శకత్వంలో శాకుంతలము అనే
సినిమాచేస్తోంది.
ఇక కరోనా సమయంలో కూడా షూటింగ్ చేస్తున్న సినిమాల్లో శాకుంతలం
సినిమా కూడా ఒకటి అని అంటున్నారు.
గుణశేఖర్ దర్శకత్వంలో
సమంత ప్రధాన పాత్రలో చేస్తోన్న శాకుంతలం
సినిమా షూట్ చేస్తున్నారు అని తెలుస్తోంది. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల దుష్యంతుల
ప్రేమ కథను ఆధారంగా చేసుకుని
గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మలయాళ నటుడు దేవ్
మోహన్ ఈ సినిమాలో దుష్యంతుడుగా నటిస్తున్నాడు.
హైదరాబాద్ లోని
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ
సినిమా షూటింగ్ జరుగుతోందని అంటున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్నా కానీ నాలుగు గంటల పాటు షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. మళ్లీ మళ్లీ నటీనటుల డేట్స్ దొరకవు అనే ఉద్దేశంతో ఈ షూటింగ్ ప్రస్తుతానికి కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక
సమంత కూడా బయట కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా సరే రిస్కు చేసి షూటింగ్లో పాల్గొన్నట్లు చెబుతున్నారు. అలాగే ఈ
సినిమా షూటింగ్ లో దాదాపు అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారు అని తెలుస్తోంది.
సమంత ఈ సినిమాలో కాకుండా ఒక
తమిళ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ త్వరలోనే
అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.