టాలీవుడ్ లోకి వచ్చిన రంగం సినిమా తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ సినిమా ద్వారా జీవా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు.. 2011లో విడుదలైన ఈ సినిమా పొలిటికల్ హైడ్రామాగా తెరకెక్కి సూపర్ హిట్ గా నిలవడంతో పాటు ఇందులో చేసిన ప్రతి ఒక్కరి కి మంచి గుర్తింపుతో పాటు మంచి పేరు కూడా లభించేలా చేసింది సినిమా.. ఎన్నో ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకుల దిమ్మ తిరిగేలా చేసిన సినిమా ఇది.. ఈ సినిమా లో జీవా తనదైన సహజ నటనతో చేసి ఆకట్టుకున్నాడు.

అయితే ఈ సినిమాలో మొదట హీరోగా జీవాని అనుకోలేదు .. ఈ సినిమాలో మొదట్లో కొన్ని సీన్స్ తమిళ హీరో శింబు కొన్ని సీన్స్ చేయగా ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. అయితే ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి అప్పట్లో ఎన్నో కారణాలు తెరపైకి వచ్చాయి.. దర్శకుడితో ఓ విషయంలో విభేదాలు రావడం తోనే శింబు ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగాలని చెప్పుకున్నారు.. అంతేకాకుండా హీరోయిన్ కార్తీక తనకు సరైన జోడీ కాదనీ భావించిన శింబు ఆమె స్థానంలో తమన్నా ని కథానాయికగా పెట్టమని చిత్ర బృందాన్ని కోరారట..

అయితే తమన్నా భారీ పారితోషకం డిమాండ్ చేయడంతో తమ వద్ద అంత బడ్జెట్ లేదని నిర్మాతలు చెప్పారట.. దాంతో శింబు నే ఆ ప్రాజెక్టు వదిలేసినట్లు కోలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి.. ఇక ఆ సినిమా తర్వాత ఆనంద్ కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మారారు .. ఈ క్రమంలోనే ఏదైనా ప్రాజెక్టు చేయాలని ఆయన చూడగా శింబు ఆయనతో సినిమా చేయడం పట్ల ఎలాంటి ఆసక్తిని చూపలేదు.. మళ్లీ చాలా రోజుల తర్వాత ఆనంద్ తో ఓ సినిమా చేయాలని శింబు అనుకోగా ఇటీవల అనారోగ్యంతో ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: