నటసింహ నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం "అఖండ". వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై బాలయ్య అభిమానుల్లోనే కాకుండా కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో లో వీరిద్దరి  కాంబినేషన్ లో వచ్చిన "సింహా" ,"లెజెండ్" వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయాలను నమోదు చేశాయి. ఈ రెండు సినిమాలలో బాలయ్య పర్ఫామెన్స్ ను ఓ రేంజ్ లో  చూపించిన బోయపాటి, మరి హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న "అఖండ" లో బాలయ్యను ఏ స్థాయిలో చూపిస్తాడోనని అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్న నా సంగతి తెలిసిందే ఒక పాత్రలో పొలిటీషియన్ గా, మరో పాత్రలో అఘోరగా నటిస్తున్నాడు. ఇక ఆ పాత్రలకు సంబంధించిన రెండు టీజర్స్ ఇప్పటికే విడుదల అయ్యి సంచలన రికార్డులను నమోదు చేశాయి. ముఖ్యంగా గా అఘోర పాత్రకు సంబంధించిన టీజర్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. టీజర్ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ అందుకున్న మొట్టమొదటి టీచర్ గా నిలిచింది. ఈ టీజర్ తర్వాత సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.

ఈ నేపథ్యంలో టీజర్ తో రచ్చ చేసిన చిత్ర యూనిట్ ఇక ట్రైలర్ తో మరోసారి రచ్చ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్) పుట్టినరోజు సందర్భంగా మే 28న సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. నిజానికి ఈ తేదీన "అఖండ" విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా సినిమాను వాయిదా వేయక తప్పక పోవడంతో, ట్రైలర్ తో నైనా అభిమానులకు కు ట్రీట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. మరి టీజర్ తోనే సంచలనం సృష్టించిన బాలయ్య ట్రైలర్ తో ఇంకెన్ని సంచలనం సంచలనం సృష్టిస్తున్నాడు చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: