అక్కినేని వారి కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా మనం. నాగార్జున తన తండ్రి కి ఘనమైన సెండ్ ఆఫ్ ఈ సినిమా ద్వారా ఇచ్చారని చెప్పొచ్చు. అక్కినేని నాగ చైతన్య సమంత జంటగా నటించగా ,నాగార్జున సరసన శ్రియ నటించారు. ఈ చిత్రాన్ని వెరైటీ చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించగా ఈ సినిమా పునర్జన్మ ల నేపథ్యంలో కొనసాగుతుంది. స్క్రీన్ ప్లే ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషించింది అని చెప్పవచ్చు.
ఈ సినిమా క్లైమాక్స్ లో నాగార్జున నాగచైతన్య ల కుటుంబం ఆపదలో ఉన్న సమయంలో అక్కినేని అఖిల్ వచ్చి వారిని కాపాడే సీన్ ఈ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది. మొదటి నుంచి నాగార్జున తన కుటుంబం మొత్తం కలిసి ఓ సినిమాలో నటించాలని ఆశ పడుతూ ఉండగా మనం సినిమాతో ఆ కోరిక తీరింది కానీ అక్కినేని అఖిల్ ఈ సినిమాలో లేని లోటు వారికి కనిపించింది కానీ దర్శకుడు విక్రమ్ కుమార్ ఎంతో తెలివిగా ఆలోచించి ఈ రకంగా అక్కినేని అఖిల్ సినిమాలో బాగం చేశాడు. మొత్తానికి ఈ సినిమాలో తండ్రి తో, ఇద్దరు కొడుకులతో, ఒక కోడలితో నాగార్జున ఈ సినిమాను తెరకెక్కించి హిట్ సాధించాడు.