ఒకసారి మనం చేసే చిన్న చిన్న పనులు ఎక్కడ లేని టెన్షన్ ను తీసుకువస్తాయి. ఆ పనులు మన దృష్టిలో ఉండి జరిగినా జరగకపోయినా వాటి వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. దాన్ని మనం కావాలని చేసిన చేయకపోయినా ఎన్నో తలనొప్పులు తెచ్చి పెడుతుంది. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి
మెగాస్టార్ చిరంజీవి విషయంలో జరిగిందట. దాని వల్ల ఆయన చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడట. ఈ విషయాన్ని ఆమధ్య
సామ్ జామ్ షోలో పాల్గొన్న
చిరంజీవి వెల్లడించాడు. ఆ సంఘటన వల్ల తాను పడ్డ ఇబ్బందిని ఆ విషయాన్ని తెలిపారు.
శంకరాభరణం సినిమాలో నటించిన
మంజు భార్గవి హీరోయిన్ గా చిరంజీవితో కలిసి కోతలరాయుడు అనే
సినిమా చేసింది. ఆ పరిచయంతో
మంజు భార్గవి శంకరాభరణం ప్రీమియర్ షో కి చిరంజీవిని రావాలని కోరింది. అల్లు రామలింగయ్య ఫ్యామిలీతో కలిసి
చిరంజీవి సినిమా కి వెళ్లగా ఆ
సినిమా క్లైమాక్స్ సీన్ అందరినీ ఎంతో బాధ పెడుతుందట. అక్కడ ఉన్న వాళ్లంతా కంటతడి పెట్టుకున్నారు.
చిరంజీవి కూడా కన్నీరు కార్చారు. లైట్స్ ఆన్ అవుతే ఎవరైనా చూస్తారని
చిరంజీవి భావించాడు. కన్నీళ్లు తుడుచుకునేందుకు కర్చీఫ్ కోసం వెతికాడు. దొరకలేదు. పక్కనే ఉన్న మంజుభార్గవి తన చీర కొంగు తో తుడుచుకోమని చెప్పింది. సరిగ్గా మంజు కొంగు
చిరంజీవి చేతిలో ఉండగానే లైట్స్ ఆన్ అయ్యాయి అప్పుడే ఈ సీన్ చూసిందట సురేఖ.
అప్పటికే సురేఖతో
చిరంజీవి పెళ్లి ముచ్చట్లు జరుగుతున్నాయట. ఈ సమయంలో ఈ రకంగా తను ఆమె తనని చూసి ఏమనుకుందో అని టెన్షన్ ఫీల్ అయ్యాడట. ఇది జరిగిన కొద్ది రోజులకు సురేఖా తో తన వివాహం జరిగింది. శంకరాభరణం
సినిమా ప్రీమియర్ షోలో తన చేతిలో ఉన్న మంజుభార్గవి చీర కొంగు చూసి ఈ పెళ్ళికి ఒప్పుకోదు అనుకున్నాడట. కానీ తను ఓకే చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడట. ఏదేమైనా
చిరంజీవి ఈ విషయంలో అదృష్టవంతుడే అని చెప్పాలి.