మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ తొలిసారిగా కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. డివివి దానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం గా అలానే చరణ్ అల్లూరి సీతారామరాజుగా యాక్ట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈసినిమా లోని ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ టీజర్స్ ఆడియన్స్ నుండి భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుని సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసాయి.
దాదాపుగా పదికి పైగా భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా సినిమా, పేట్రియాటిక్ డ్రామా మూవీగా యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటి అలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, శ్రియ శరన్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. సినిమాకి సంబంధించి కేవలం రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు ఇటీవల యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారమే అక్టోబర్ 13న విడుదల కానున్నట్లు టాక్.
ఇక అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమాకి సంబంధించి పలు ఇన్నర్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం దర్శకధీరుడు జక్కన్నఆర్ఆర్ఆర్ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఎంతో బాగా అలరించేలా అద్భుతంగా చెక్కారని, ముఖ్యంగా హీరోలిద్దరూ కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి యాక్ట్ చేసారని అంటున్నారు. తెరపై ఎన్టీఆర్, చరణ్ కాకుండా భీం, రామరాజు మాత్రమే కనిపించేంతలా వారిద్దరూ ఆయా పాత్రల్లో పరకాయప్రవేశం చేశారట. ఇక ఇతర నటీనటులు కూడా ఎంతో గొప్పగా నటించారని, సినిమాలోని భారీ విజువల్స్, యాక్షన్ సీన్స్, ఫైట్స్ అయితే ఆడియన్స్ ని కట్టిపడేస్తాయని అంటున్నారు. మొత్తంగా ఎన్నో భారీ అంచనాలతో రానున్న ఈ సినిమా రేపు విడుదల తరువాత గత రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టి సరికొత్త సెన్సేషన్ ని క్రియేట్ చేయడం ఖాయం అని సమాచారం ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: