టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎంతోమంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుని ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. తొలుత సహాయక పాత్రలో నటించి ఆ తర్వాత విలన్ గా నటనకు గుర్తింపు వచ్చే విధంగా సినిమాలు చేసి హీరోలుగా సెటిల్ అవుతారు.  అలాంటి హీరోలలో ఒకరు అడవిశేశ్. చిన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నటుడిగా సహాయనటుడిగా విలన్ పాత్రను పోషించి ఇప్పుడు మినిమం రేంజ్ హీరోగా ఉన్నాడు అడవి శేష్.

ఆయన ప్రస్తుతం మహేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కుతున్న మేజర్ సినిమాలో నటిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న సినిమాలను చూసి ఆయనకు భారీ స్థాయిలో క్రేజ్ పెరిగింది. ఇతర భాషల వాళ్ళు సైతం ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలను చూసి ఇంప్రెస్ అయి పోతున్నారు. ఉత్తరాది ప్రేక్షకులు సైతం అదే ఆదరణ పెరగడంతో మేజర్ సినిమాను నిర్మించి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 26/ 11 ముంబై ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొంది హీరోగా అవతరించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుకుంది. అయితే ఎన్నో ఆశలు పెట్టుకుని అడవి శేష్ చేస్తున్న ఈ చిత్రానికి ఇప్పుడు గట్టి దెబ్బ తగిలేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమా కు సంబంధించిన కథాంశంతో ఓ బాలీవుడ్ సినిమా ఇటీవలే విడుదల అయ్యింది. సిద్ధార్థ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా దక్షిణాది దర్శకుడు విష్ణువర్ధన్ రూపొందించిన షేర్షా సినిమా కార్గిల్ వార్ హీరో మేజర్ విక్రమ్ బత్రా జీవితం ఆధారంగా తెరకెక్కగా ఈ రెండు కథల్లో ఒకే కథాంశం  కనిపిస్తుంది. దీంతో తన సినిమా కు క్రేజ్ తగ్గుతుందని అడవి శేష్ భయపడుతున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: