అలా వచ్చిన వారిలో సౌత్ ఇండియాలో సత్తా చాటుతున్న బాలీవుడ్ హీరోయిన్ పేర్లలో, ముందుగా అలియాభట్ ఉంది. గతంలో ఈమెను తెలుగు సినిమాలలో కొంతమంది డైరెక్టర్లు నటించమని అడగగా, అందుకు ఒప్పుకోలేదు. కానీ రాజమౌళి డైరెక్షన్ లో సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా విడుదల కాకముందే ఈమె సౌత్ ఇండియా లో బాగా క్రేజ్ సంపాదించుకుంది.
ఇక టాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలలో నటించిన బాలీవుడ్ మరొక హీరోయిన్ ఐశ్వరరాయ్. ఈమె పలు సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చివరిగా రోబో సినిమాలో నటించింది. ఇక వన్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన కృతిసనన్.. ఆ తర్వాత నాగచైతన్య దోచెయ్ సినిమా తీసిన అది సక్సెస్ కాలేకపోయింది. ఈమె ప్రస్తుతం ఆది పురుష్ సినిమాలో నటిస్తున్నారట.
శ్రీదేవి కూతురు అయినటువంటి జాన్వికపూర్ కూడా తెలుగులో త్వరలో పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి బాలీవుడ్ లో బాగానే రాణిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి లింగా మూవీ లో నటించిన సోనాక్షి సిన్హా కూడా ఈ మధ్య చిరంజీవితో , ఒక సినిమాలో నటిస్తున్నట్లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ తో కలిసి బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
కియారా అద్వానీ మహేష్ బాబు తో, రామ్ చరణ్ తో ఇప్పటికే సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక అంతే కాకుండా మరొకసారి శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా రామ్ చరణ్ తో జోడి కట్టనుంది ఈ భామ.