సినిమా నటిగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత యాంకర్ గా సెటిల్ అయిన నటీమణీ రష్మీ. బుల్లితెర ప్రేక్షకుల్లో షోలతో యాంకరింగ్ చేస్తూ మంచి స్థానాన్ని సంపాదించుకుంది. యాంకర్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న తర్వాత వెండితెరపై కనిపించి తెలుగువారికి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కోట్లాది మంది ఫ్యాన్స్ ని సంపాదించుకొని తన అందాలతో వారికి పిచ్చెక్కిస్తుంది. కేవలం అందం మాత్రమే కాదు టాలెంట్ పరంగా కూడా గొప్ప వ్యక్తి. ఆమె స్టైల్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే అతిశయోక్తి కాదు.

 జబర్దస్త్ షో లో ఆమె చేసే అల్లరికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు . ఇక బుల్లితెర నటుడు సుధీర్ కి ఆమె కి మధ్య ఉన్న కెమిస్ట్రీ సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరి జంట కు ఓ రేంజిలో ఫాలోయింగ్ వుంది. యూట్యూబ్ కపుల్ గా ఈ జంటకు భారీ పాపులారిటీ ఉంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వీరిద్దరికి ఇంత పాపులారిటీని తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. వీరు ప్రేమించుకుంటున్నారని పెళ్లి చేసుకోవాలని ఫ్యాన్స్ చెప్తుండగా, వీరి మధ్య ఉంది కేవలం స్నేహం మాత్రమే అని చెప్పుకొస్తున్నారు వీరు.  

ఇకపోతే జబర్దస్త్ ఆర్టిస్ట్ వర్ష తనపై వస్తున్న ట్రో ల్స్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు చేయగా రష్మి కూడా స్పందిస్తూ ఫీల్ అయ్యింది.  రీసెంట్ గా నేను నటించిన ఒక ట్రైలర్ విడుదల అయితే అందులో సుధీర్ యాక్ట్ చేస్తే బాగుంటుందని పలువురు కామెంట్స్ చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ అందరం కలిసి పనిచేసిన సరే ఎవరి పర్సనల్ లైఫ్ వారికి ఉంటాయని దాన్ని ఎందుకు ఒప్పుకోరు అని ఆమె ఆగ్రహించారు. అబ్బాయిలు ఎంతో మంది తో పులిహోర కలిపిన కానీ అమ్మాయిలు క్యారెక్టర్ పరంగా మాత్రం తప్పు పడతారు అని ఆవేదన చెందింది రష్మీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: