దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా తో డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. 'బాహుబలి' సినిమా ఇచ్చిన జోష్ లోనే వరుస పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఇష్టపడిన ప్రభాస్ అందులో భాగంగానే ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటించి విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే 'సాహో' సినిమా టాలీవుడ్ కంటే బాలీవుడ్ మీదే ఎక్కువ ఇంపాక్ట్ చూపించి అనడంలో కూడా ఏమాత్రం అనుమానం అక్కరలేదు. క్రేజ్ పరంగా అయిన , కలెక్షన్ల పరంగా అయిన  బాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా దూసుకుపోతున్న ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. అవి రాధాకృష్ణ దర్శకత్వంలో  'రాదే శ్యామ్'  ఓమ్ రౌత్ దర్శకత్వంలో 'ఆది పురుష్',  'కే జి ఎఫ్' సినిమా తో ఇండియా వైడ్ మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంతి నీల్ దర్శకత్వంలో 'సలర్' సినిమాతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాలలో 'రాధే శ్యామ్' సినిమా ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకొని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఇప్పటికే విడుదల చేయగా జనాల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది .ఇక 'ఆది పురుష్' మరియు 'సలర్' సినిమాలు శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా పూజాకార్యక్రమాలు ఈ మధ్యనే పూర్తి అయ్యాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది .ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా ప్రభాస్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాల లిస్టు చూసి చాలామంది ప్రభాస్ ను ఢీ కొట్టే హీరో ఇండియాలోనే లేడు అని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: