నిఖిల్ హీరోగా స్వాతి హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో వెంకట్ శ్రీనివాస్ నిర్మాతగా 2014వ సంవత్సరం విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం 'కార్తికేయ' . ఈ  సినిమా విడుదలకు ముందు పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చింది. కానీ విడుదల తర్వాత మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో దర్శకుడు చందు మొండేటి తెలుగు లో అప్పటి వరకు చూపెట్టనటువంటి కొన్ని సీన్ల ను చూపెట్టు ఆ సన్నివేశాలతో తెలుగు ప్రజలను ఆకట్టుకున్నాడు . ఈ సినిమాలో నిఖిల్, స్వాతి మధ్య జరిగే సన్నివేశాలను కూడా దర్శకుడు చాలా అద్భుతంగా తెరకెక్కించాడు.

ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చాడు. ఇలా ఎన్నో అంశాలతో  బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు సీక్వల్ ను తెరకెక్కించే ఆలోచనలో చిత్రబృందం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ ను కృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజు చిత్ర బృందం విడుదల చేసింది. మొదట ఈ అప్ డేట్ ఇవ్వడానికి ముందు దర్శకుడు చందు మొండేటి ఒక అమ్మాయి తలకు రెండు చేతులు అడ్డుపెట్టి ఈ అమ్మాయి 'కార్తికేయ 2' సినిమాలో హీరోయిన్, ఈ హీరోయిన్ ఎవరో మీకు ఈరోజు అనగా (30 ఆగస్టు2021) 06:03 తెలియజేస్తాం అంటూ ఒక పోస్ట్ చేశారు. ఆ తర్వాత 6:30 నిమిషాలకు ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో దర్శకుడు చందు మొండేటి ఆ హీరోయిన్ తలకి అడ్డు పెట్టిన  రెండు చేతులను తీస్తూ హీరోయిన్ ను చూపించారు. అక్కడ అనుపమ పరమేశ్వరన్ ఉంది. దానితో దర్శకుడు మరియు హీరో నిఖిల్ మీకు ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది 'కార్తికేయ టు' సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ అంటూ నిఖిల్ ప్రకటించాడు. దానికి అనుపమ పరమేశ్వరన్ నేను  చాలా ఎగ్జియిట్ గా ఉన్నాను అని సమాధానమిచ్చింది. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న '13 పేజీస్' సినిమాలు హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: