టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ షుటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సర్కారు వారి పాట స్టార్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో జరుగుతోంది. అయితే తాజాగా మాదాపూర్ లోని ఒక ప్రముఖ హోటల్ లో సర్కారు వారి పాట షూటింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సర్కారు వారి పాట షూటింగ్ సెట్ లోకి అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మరియు ఎంపీ శశి ధరూర్.

ఇది ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. "ఈ రోజున మాదాపూర్ లోని ఓ ప్రముఖ హోటల్ లో మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ను కలిశాను. ఈ సందర్భంగా మహేష్ బాబు అయిన గల్లా జయదేవ్ కూడా వచ్చారు. మహేష్ బాబు ను కలిసిన తర్వాత కాసేపు అతడితో ముచ్చటించాము. నిజానికి మహేష్ బాబు సూపర్ స్టార్.. ఎంతో గొప్ప మనిషి. మహేష్ బాబు ను కలవడం నాకు హ్యాపీ ఉంది" అంటూ తన ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్.  

అంతే కాదు మహేష్ బాబు తో దిగిన ఫోటోలను షేర్ చేశారు శశిధరూర్. ఇదిలా ఉండగా మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాటలు సినిమా లో... టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి విదితమే. ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బీ ఎంటర్టైన్మెంట్స్, మరియు 14 ప్లస్ రీల్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానున్నది.



మరింత సమాచారం తెలుసుకోండి: