తాజాగా జరిగిన సాక్షి సెవెంత్ ఎడిషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకలో అల్లు అర్జున్ టీం మెరిసిపోయింది. ఇందులో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రానికి పలు అవార్డులు లభించడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ వారు అందుకున్న అవార్డులతో ఫోటోలకు పోజులిచ్చారు.  ఈ చిత్రం నుండి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత స్వరకర్త, ఉత్తమ చిత్రం కేటగిరీలలో అవార్డులను గెలుచుకుంది. ఇందులో నటించిన తారాగణం అల్లు అర్జున్, పూజా హెగ్డే, త్రివిక్రమ్, తమన్నా, నిర్మాతలు ఎస్ రాధాకృష్ణ, నాగ వంశీ తదితరులు ఈ అవార్డులను గెలుచుకున్నారు.

ఈ చిత్రం గత ఏడాది సంక్రాంతికి బరిలోకి దిగింది. భారీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి బాహుబలి తరువాత ఆ స్థాయి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కు పాన్ ఇండియా అభిమాన గణం ఉన్న విషయం తెలిసిందే. దీనితో ఈ చిత్ర విజయం కూడా అదే స్థాయిలో నిలిచింది. కేవలం ఈ చిత్రం అనే కాదు, బన్నీ ఏ చిత్రమైనా అదే తరహాలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అందువలననే షూటింగ్ నిమిత్తం ఇండియా లో ఎక్కడకు వెళ్లినా అక్కడ అభిమానులు కోలాహలం చేస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు బన్నీ కూడా అభిమానులను అలరించడానికి చిత్ర ప్రదర్శన సందర్భంలోనో లేక సక్సెస్ మీట్ ద్వారానో ఆయా ప్రాంతాలకు వెళుతూ ఉంటాడు.

ఇటీవల వార్తా మాధ్యమాలు కేవలం ప్రజలకు వార్తలు చేరవేయడమే కాకుండా అప్పుడప్పుడు వివిధ రంగాలలో కృషి చేసిన వారికి ఆయా స్వచ్చంద సంస్థలతో కలిసి అవార్డుల ప్రదానం కూడా చేస్తున్నాయి. అలా నిర్వహించిన కార్యక్రమంలోనే ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కేవలం వార్తలు ప్రసారం కంటే అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండటం వలన వివిధ వర్గాల వారిని ప్రోత్సహించినట్టుగా ఉంటుంది, ప్రేక్షకులకు సాధారణ వార్తల నుండి కాస్త ఆటవిడుపుగాను ఉంటుంది. వీళ్లకు కూడా కావాల్సినంత ప్రచారం కూడా జరిగిపోతుంది. ప్రచారం అవసరం లేని స్థాయిలో ఉన్నప్పటికీ, ఇలాంటి కార్యక్రమాలు జరుపుతుండటం వలన ఆయా సెలెబ్రిటీల ద్రుష్టి కూడా ఈ సంస్థలపై ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: