అక్కినేని
అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజబుల్
సినిమా దసరా కానుకగా
అక్టోబర్ 15వ తేదీన విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని
గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించగా
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
గోపి సుందర్ సంగీతం అందించిన ఈ
సినిమా విడుదల ఎప్పుడో విడుదల జరగాల్సి ఉండగా
కరోనా కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని
దసరా కానుకగా విడుదల చేస్తున్నామని ఈ చిత్ర బృందం చెప్పగా వాస్తవానికి
అక్టోబర్ 8వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు కానీ ఇప్పుడు ఈ
సినిమా అక్టోబర్ 15 కు వాయిదా వేయడం.
ఇండస్ట్రీకి వచ్చి మూడు సినిమాలు చేసినా కూడా అక్కినేని
అఖిల్ కు ఇంత వరకూ భారీ హిట్ సొంతం అవలేదు. దాంతో ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతోనైనా హిట్ కొట్టి హీరోగా సెటిల్ అవ్వాలని ఆయన భావిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయనను స్క్రీన్ పై ఏ ప్రేక్షకుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అఖిల్ సినిమాలో ఓవర్ యాక్షన్ అన్నారు.
హలో మరియు మిస్టర్ మజ్ను సినిమాలలో ఆయన రేంజ్ కు తగ్గ
సినిమా చేయలేదు అన్నారు. ఇప్పుడు కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కాబట్టి ఈ చిత్రం ఆయనకు మంచి విజయాన్ని చేకూర్చాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
ఇకపోతే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
సినిమా విడుదల కాకముందే ఆయన
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే
సినిమా ను మొదలుపెట్టి దాదాపు సగభాగం షూటింగ్ పూర్తి చేశాడని తెలుస్తుంది. ఈ చిత్రంలో ఆయన లుక్స్ ఎంతో ప్రామిసింగ్ గా ఉండడంతో ఈ
సినిమా తప్పకుండా ఆయనకు గొప్ప విజయాన్ని సాధిస్తుందని భావిస్తున్నారు. యాక్షన్ స్పై
థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ
సినిమా అఖిల్ కొత్త కోణంలో చూపించడం మాత్రమే కాకుండా ఆయనలోని నటనను కూడా ప్రేక్షకులు లోకానికి తెలియజేసే విధంగా ఉంటుందని చెబుతున్నారు. ఇకపోతే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఈ వారంలో విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. మరి ఈ సినిమాపై అంచనాలు పెరగాలంటే ఈ ట్రైలర్ బాగుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.