అక్కినేని అఖిల్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఈ సినిమా ఎన్నో రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ ఈ మధ్య షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాను అక్టోబర్ 15 వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఇప్పటికే మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ ,పాటలు, ప్రచార చిత్రాలకు జనాలు నుండి మంచి ఆదరణ దక్కడం మాత్రమే కాకుండా, ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి అని చెప్పవచ్చు.

 అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ నెల 8 వ తేదీన భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేయనుంది. అయితే ఈ సినిమాను జనాల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు అక్కినేని అఖిల్ అన్న అక్కినేని నాగ చైతన్య ఈ సినిమాకి సపోర్ట్ గా నిలవడానికి రెడీ అయ్యాడు. అక్టోబర్ 8 వ తేదీన భారీ ఎత్తున నిర్వహించబోయే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నాగ చైతన్య ముఖ్య అతిధి గా నాగ చైతన్య రానున్నట్లు చిత్రబృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఇక ఈ మూవీ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. బన్నీ వాసు వాసు వర్మ ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రదీశ్ ఎమ్ వర్మ  సినిమాటోగ్రఫీ చేస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం సమకూర్చారు. ఇది ఇలా ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న అక్కినేని అఖిల్ కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: