టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో అడివి శేష్ మొదటి నుంచి కూడా ఎన్నో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే శేష్ ఇప్పుడు మేజర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు.కేరళకు చెందిన భారత మాత ఒడిలో వీర మరణం పొందిన అమర సైనికుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, మలయాళం,హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ఉన్ని కృష్ణన్ ధైర్యం త్యాగాన్ని ఉద్విగ్నభరితంగా తెరపై చూపించనున్నారు. మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితంలోని వివిధ దశలను తెరపై ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు మేకర్స్. సినిమా రిలీజ్ డేట్ తోపాటు మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోను ఈ సినిమాకి నిర్మాత అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ ఈ వీడియోను షేర్ చేసి చిత్రయూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది.మేజర్ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ రూ.10 కోట్లు పలికినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ ఇంకా A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా 'మేజర్' సినిమాని నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు అడివి శేష్ ఎప్పటిలాగే స్క్రిప్ట్ ఇంకా ఆలాగే స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం.ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఈ సినిమాతో అడివి శేష్ కూడా పెద్ద పాన్ ఇండియా హీరో అవ్వడం ఖాయంలా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: