ఇకపోతే దర్శకుడు క్రిష్ టాలీవుడ్ లో తన కెరియర్ గమ్యం అనే సినిమాతో ప్రారంభించాడు అన్న విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇక మొదటి సినిమా తర్వాత ఒక వైవిధ్యమైన కథను ఎంచుకుని ఆ సినిమాను భారీ తారాగణంతో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే వేదం సినిమా. వేదం సినిమా ఇప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒక మనిషి మనిషిగా బ్రతకాలి తప్ప దేనికోసం పోరాడ కూడదు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కేబుల్ రాజు పాత్రలో అల్లు అర్జున్.. రాక్ స్టార్ పాత్రలో మంచు మనోజ్ నటిస్తారు.
ఇక ఈ సినిమాలో హైలెట్ ఏంటంటే అప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన అనుష్క ఏకంగా ఒక వేశ్య పాత్రలో నటించటం.అయితే హీరోలుగా ఉన్న మంచు మనోజ్, అల్లు అర్జున్ లను ఏదో ఒక విధంగా ఒప్పించిన క్రిష్.. స్టార్ హీరోయిన్ అనుష్క ను వేశ్య పాత్ర కోసం ఒప్పించడానికి భయపడ్డాడట . ముందుగా క్రిష్ స్టోరీ చెప్పడానికి వెళ్లిన సమయంలో.. ఇక స్టోరీ చెబుతుండగా అనుష్క ఎంతగానో ఎడ్చేసిందట. స్టోరీ చెప్పిన తర్వాత మీకు ఈ స్టోరీ నచ్చిందా లేదా అని అడిగితే.. నా కళ్ళను చూస్తే అర్థం కావడం లేదా అని చెప్పిందట అనుష్క. ఈ సినిమా తప్పకుండా చేస్తాను అని ఒప్పుకుందట.