టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. మల్టీస్టారర్ సినిమాల విషయంలో కొంత మంది స్టార్ హీరోలు భయపడుతున్నారు అనే వార్తలు కూడా ఎక్కువగానే ఈ మధ్య కాలంలో మనం వింటూనే ఉన్నాం. మల్టీ స్టారర్ సినిమా అనగానే భారీ బడ్జెట్ పట్టాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అనే మాట వాస్తవం. అయితే మల్టీస్టారర్ సినిమాలకు సంబంధించి కొంత మంది నిర్మాతలు ఇష్టపడుతున్నా సరే మరి కొంతమంది మాత్రం వెనకడుగు వేస్తున్నారు అనే ప్రచారం కూడా టాలీవుడ్ వర్గాల్లో ఉంది.

అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఆధారంగా చూస్తే టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాల విషయంలో పూరి జగన్నాథ్ కూడా ఆసక్తి చూపిస్తున్నాడు అనే వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రస్తుతం తన కెరీర్ లోనే ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న పూరి జగన్నాథ త్వరలోనే మల్టీస్టారర్ సినిమాకు సంబంధించి ప్లాన్ చేసే అవకాశం ఉండవచ్చు అని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. అయితే మల్టీస్టారర్ సినిమాలో పెద్ద హీరోలతో చేయకుండా చిన్న హీరోలతో చేసే ఆలోచనలో కూడా అతను ఉన్నాడు అనేది కొంతమంది అంటున్నారు.

రామ్ పోతినేని అదేవిధంగా విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ సినిమా తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడని దీనికి సంబంధించి ప్రణాళిక కూడా రెడీ అయిందని ఒక కథ కూడా సిద్ధం చేసుకున్నాడు అని దీనికి నిర్మాతగా... కొత్త నిర్మాత వ్యవహరించే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. దీనికి సంబంధించి ఇంకా ప్రకటన రాకపోయినా త్వరలోనే దీనిపై పూరి జగన్నాథ్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. భారీ బడ్జెట్ కాకుండా 60 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో తన కొడుకును కూడా పెట్టే ఆలోచనలో పూరి జగన్నాథ్ ఉన్నాడని టాలీవుడ్ వర్గాల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: