చాలా వరకు దర్శకులు తమ మొదటి సినిమా తీయడంలో కాస్త తడబడుతూ ఉంటారు, దానికి ప్రధాన కారణం అప్పటి వరకు వారు ఏ సినిమాలకు దర్శకత్వం వహించక పోవడం మరియు ఇతర కారణాలు కూడా అయి ఉండవచ్చు. కానీ కొంత మంది దర్శకులు మాత్రం మొదటి సినిమానే చాలా అనుభవం ఉన్న దర్శకుల తీర్చిదిద్దుతారు. ఆ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకుంటారు.  అలాంటి దర్శకులలో మనం బుచ్చిబాబు సన గురించి కూడా మాట్లాడుకోవాలి.. బుచ్చిబాబు సన, ఈ దర్శకుడు టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరైన సుకుమార్ దగ్గర  శిష్యుడు గా పని చేశాడు. ఆ తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా తెరకెక్కిన ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

ఈ సినిమాలో దర్శకుడు బుచ్చిబాబు సన  హీరో, హీరోయిన్ ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు.  అలాగే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం కూడా ఒక ముఖ్య కారణం. ఇలా ఎంతోమంది కృషితో ఈ సినిమా  వందకోట్ల కలెక్షన్స్ వరకు సాధించింది. ఇలా మొదటి ఈ సినిమాతోనే ఈ దర్శకుడు వంద కోట్ల మార్కును అందుకున్నాడు. అయితే ఈ దర్శకుడు ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ వరుస సినిమాలు ఓకే చేస్తూ రావడంతో బుచ్చిబాబు సినిమా ఆగిపోయినట్లు అని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బుచ్చిబాబు ఒక ఇంటర్వ్యూ లో తాను ఒక పెద్ద హీరోకు స్టోరీ లైన్ చెప్పాను. ఆయన కూడా ఓకే చెప్పాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి అని చెప్పాడు. ఒక్కో సన్నివేశం కోసం పదుల వర్షన్స్ రాస్తున్నట్లు కూడా తెలియజేశాడు. అయితే ఇలా బుచ్చిబాబు సన తెలియజేయడంతో ఇదంతా ఎన్టీఆర్ సినిమా కోసమే అని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: