చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ క్రాష్ ప్రమాదంలో మరణించారు. తమిళనాడులోని కూనూర్‌లో బుధవారం అంటే నిన్న ఈ ప్రమాదం జరిగింది. జనరల్ బిపిన్ రావత్ మృతితో దేశం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. అదే సమయంలో భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు కళాకారులు కూడా జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనకు నివాళులర్పించారు. చిరంజీవి నుంచి వివేక్ ఒబెరాయ్ వరకు పలువురు ప్రముఖులు బిపిన్ రావత్‌కు నివాళులర్పిస్తూ ట్వీట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
 


నటుడు సిద్ధార్థ్ "CDS జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మరియు ఇతర ప్రముఖులు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషాదకరమైన వార్త. వారి కుటుంబాల కోసం ప్రార్థనలు మరియు కొన్ని సానుకూల అభివృద్ధి కోసం ఆశిస్తున్నాము. జీవితం చాలా సున్నితమైనది, అనూహ్యమైనది" అంటూ ట్వీట్ చేశారు.

 

నటి తమన్నా భాటియా  "CDS జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికా రావత్ మరియు 11 మంది ఆర్మీ ఆఫీసర్ల మరణం గురించి వినడం చాలా బాధాకరం" అంటూ ట్వీట్ చేసింది.



వివేక్ ఒబెరాయ్ "జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ మరణం గురించి తెలుసుకున్నప్పుడు చాలా బాధపడ్డాను. సార్ మాతృభూమికి 4 దశాబ్దాల నిస్వార్థ సేవకు మీకు వందనం. భారతదేశపు అత్యుత్తమ సైనికుల్లో ఒకరిని కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను" అని అన్నారు.

"ఈరోజు కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య శ్రీమతి మధులికా రావత్ మరియు మరో 11 మంది వ్యక్తుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. సాయుధ దళాలకు విషాద దినం. అతని ఆత్మకు శాంతి చేకూరు గాక" అని తారా దత్తా రాశారు.



జనరల్ బిపిన్ రావత్ కోసం ప్రార్థిస్తూ పరేష్ రావత్ ఒక ట్వీట్ చేశారు. అందులో "నేను సిడిఎస్ జనరల్ బిపిల్ రావత్ కోసం ప్రార్థిస్తున్నాను" అని రాశారు. జనరల్ బిపిన్ రావత్ మరణ వార్త రాకముందే ఈ ట్వీట్ పరేష్ రావల్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: