గత సంవత్సరం త్రివిక్రమ్ తీసిన భారీ మూవీ అలవైకుంఠపురములో మూవీ తో కెరీర్ పరంగా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప పార్ట్ 1. గతంలో తనతో ఆర్య, ఆర్య 2 వంటి సినిమాలు తీసిన లెక్కల మాస్టర్ సుకుమార్ తో ఎంతో గ్యాప్ తరువాత అల్లు అర్జున్ చేసిన మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాకి క్యూబా కెమెరా మ్యాన్ గా పని చేయగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేసాయి. ఇక ఎన్నో అంచనాల తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప మూవీ ప్రేక్షకాభిమానులు నుండి మంచి స్పందన రాబట్టుకుంటోంది. సినిమాలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో పాటు దర్శకుడు సుకుమార్ మరొక్కసారి తనదైన ఆకట్టుకునే టేకింగ్ తో పుష్ప ని ఎంతో బాగా తీసారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

హీరోయిన్ రష్మిక అందం, అభినయంతో పాటు భారీ యాక్షన్,ఫైట్ సీన్స్, సాంగ్స్, బీజీఎమ్, విజువల్స్ పుష్ప కి మంచి సక్సెస్ ని అందించాయని, అలానే గత సంవత్సరం అలవైకుంఠపురములో మూవీ తో హీరోగా పెద్ద సక్సెస్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ పుష్ప మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా అన్ని భాషల ఆడియన్స్ మనసు గెలుచుకుని అందరి స్టార్ గా మరింత గొప్ప పేరు దక్కించుకున్నారని అంటున్నారు ఆయన అభిమానులు. మొత్తంగా పుష్ప మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో మూవీ టీమ్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: