మైత్రి మూవీ మూవీ మేకర్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్ర లో అల్లుఅర్జున్ కనిపించగా, శ్రీవల్లి అనే పాత్రలో రష్మిక నటించి తమ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. మాస్, యాక్షన్ తో కూడిన రస్టిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పుష్ప తొలి రోజు మొత్తంగా రూ. 71 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుందని, నిర్మాతలైన మైత్రి వారు ప్రకటించారు. ఇక నిన్న కూడా మూవీ కి బాగానే కలెక్షన్ వచ్చిందని, రెండు రోజులకు గాను తమ సినిమా మొత్తంగా రూ. 116 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు వారు కొద్దిసేపటి క్రితం తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పోస్ట్ చేసారు.
మరోవైపు అలవైకుంఠపురములో వంటి హిట్ తరువాత ప్రస్తుతం పుష్ప రూపంలో తమ హీరోకు మరొక సక్సెస్ దక్కడం తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు ఆదివారం కావడంతో పుష్ప మూవీ చాలా వరకు ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ అయ్యే ఛాన్స్ ఉందని, తద్వారా నేడు కూడా ఇది మంచి కలెక్షన్ ని అందుకుంటుందని, అయితే రేపటి నుండి పుష్ప కి నిజమైన బాక్సాఫీస్ పరీక్ష మొదలవుతుందని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు. మరి రాబోయే మరికొద్ది రోజుల్లో పుష్ప ఎంత మేర కలెక్షన్ అందుకుంటుందో చూడాలి.