హీరో విజయ్ శంకర్ విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు. తాజాగా మరొక విలక్షణమైన, ఇంట్రెస్టింగ్ కథతో మన ముందుకు రానున్నారు. రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు పోకస్ అనే ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ని పెట్టారు. ఈ సినిమాతో జి సూర్య తేజ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇందులో ఆషు రెడ్డి, సుహాసిని, భానుచందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.వినోద్ యాజమాన్య ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు.

 ఈ సినిమా మర్డర్ అండ్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది.ఇందులో ప్రముఖ సీనియర్ నటి సుహాసిని మణిరత్నం కూడా కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే యూట్యూబ్ లో పలు వీడియోల ద్వారా, బిగ్ బాస్ ద్వారా మనందరికీ పరిచయం అయినా అషు రెడ్డి హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో విజయ్ శంకర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా, సుహాసిని జడ్జి పాత్రలో నటించబోతోంది.

ఈ సినిమాకు ఫోకస్ అనే ఒక డిఫరెంట్ టైటిల్ పెట్టడంతో ప్రేక్షకులు  కూడా ఈ సినిమా పై ఫోకస్ ని పెడుతున్నారు. ఇకపోతే ఈ సందర్భంగా దర్శకుడు సూర్య తేజ మాట్లాడుతూ..అయితే ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో మర్డర్ అండ్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా వాటన్నింటికీ భిన్నమైనది అని తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా కొత్త తరహా అనుభూతిని ఇవ్వడమే కాకుండా, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అని తెలిపారు. అలాగే ఈ సినిమా గురించి వివరాలు విశేషాలను  త్వరలోనే వెల్లడిస్తామని సూర్య తేజ తెలిపారు. ఈ సినిమా మర్డర్ మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను ఇష్టపడే ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని ఇస్తుంది అని దర్శకుడు సూర్యతేజ చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: