సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీస్ వరకు.. ప్రతి ఒక్కరూ 2021 కి బై బై చెప్పి..2022 కు వెల్కమ్ చెప్పారు. అయితే సెలబ్రిటీస్ సైతం కొంతమంది విదేశాలకు వెళ్లి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. అలా ఆ వేడుకల్లో ముగించుకొని తిరిగి తమ లైఫ్ లోకి బిజీగా మారిపోయారు. ఈ ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకొని తమ కెరీర్ బాగా కలిసి రావాలని.. ప్రయత్నాలలో బిజీగా మునిగిపోయారు మన సెలబ్రిటీస్.. అందులో ముఖ్యంగా రకుల్ ప్రీతిసింగ్ కూడా తాజాగా న్యూ ఇయర్ వేడుకలను పూర్తిచేసుకొని ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది. కేవలం ఆమె ఒక్కటే కాదు తన ప్రియుడితో కలిసి ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫోటోలు సీసీ కెమెరాలకు చిక్కింది.
ఈ న్యూ ఇయర్ వేడుకలను తన ప్రియుడు జాకీ భగ్నా తో కలసి లండన్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ జంట న్యూ ఇయర్ వేడుకలకు రెండు రోజుల ముందే అక్కడికి చేరుకున్నదట. అక్కడ సెలబ్రేషన్స్ పూర్తిచేసుకుని తిరిగి ప్రయాణం లో ఎయిర్ పోర్ట్ లో కలిసి కనిపించారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం అక్కడ కూడా చాలా అవకాశాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ మధ్య అవకాశాలు భారీగా తగ్గిపోయాయి అని చెప్పవచ్చు. ఇక తన ప్రియుడు కూడా ఒక నిర్మాత కావడంతో బాగా కలిసి వచ్చిందని బాలీవుడ్లో ఈమెకు చెప్పవచ్చు.

ఇక అంతే కాకుండా జాకీ కి ఎన్నో వ్యాపార సంస్థలు ఉన్నాయి.. అయినప్పటికీ రకుల్ ప్రియుడు జాకీ సినిమాలో నటించాలని ఆశ పడుతుండడంతో.. ఇక రకుల్ కూడా ఒక హీరోయిన్ కాబట్టి ఇద్దరు కలిసి బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేస్తారు తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: