తెలుగు సినిమా ఇండస్ట్రీ లకు ఎంతో మంది హీరోయిన్లు వస్తూనే ఉన్నారు.. అయితే తాజాగా ఫరియా అబ్దుల్లా జాతి రత్నాలు మూవీతో బాగానే పాపులర్ అయింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాతోనే ఈమె పొడుగుకాళ్ల సుందరి గా మారిపోయింది.. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది అని చెప్పవచ్చు. ఈ సినిమాతోనే ఈమెకు చిట్టి అనే పేరు ముద్ర వేసుకుంది.. ఈమె హైట్ ను చూసి హీరో ప్రభాస్ ఏ ఆశ్చర్యపోయారు. ఇక తన అందంతో తన స్మైల్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.


జాతి రత్నాలు సినిమా తర్వాత అక్కినేని నాగార్జున, తన కుమారుడు కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో అవకాశాన్ని దక్కించుకుంది. ఇక అంతేకాకుండా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న రావణాసుర.. అనే సినిమాలు ముగ్గురు హీరోయిన్లు అందులో ఈమె కూడా ఒకరు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ నెల 14వ తేదీన ప్రారంభించనున్నారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మకు మరొక అవకాశం దక్కించుకుంది.. అదేమిటంటే సోలో హీరోగా తన సినిమాలు నటిస్తూ మంచి స్పీడ్ మీద ఉన్నాడు హీరో సంతోష్ శోభన్.. డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమాని త్వరలోనే ప్రారంభించనున్నారు.

డైరెక్టర్ మేర్లపాక గాంధీ హీరో నితిన్ తో కలిసి మాస్ట్రో మూవీని నిర్మించారు. నాభానటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా మంచి విషయాన్ని అందుకుంది. ఇక ప్రతిసారీ స్టార్ హీరోలతోనే కాకుండా మరోసారి కుర్ర హీరో సంతోష్ శోభన్ తో కూడా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు గా సమాచారం. ఇక ఈ సినిమాని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోతోందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక అఫీషియల్ విషయాన్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: