రామ్ చరణ్ డబ్యూ చిత్రం `చిరుత`. డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ నిర్మించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో రామ్ చరణ్కు జోడీగా నేహా శర్మ నటించింది. 2007 సెప్టెంబరు 28న గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం రూ.25 కోట్ల షేర్ వసూల్ చేసి సూపర్ హిట్గా నిలిచింది.
కాగా, రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన ఎన్టీఆర్తో కలిసి `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)` సినిమా చేశాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 7న విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత చరణ్ తన 15వ చిత్రాన్ని శంకర్తో, 16వ చిత్రాన్ని జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.