నందమూరి నట సింహం బాలకృష్ణ అఖండ సినిమా షూటింగ్ దశలో ఉన్న సమయంలోనే తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో ఆన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే,  ఈ టాక్ షో  ఎన్నో టాక్ షో లను బీట్ చేసి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఈ టాక్ షో మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ గా మోహన్ బాబు, విష్ణు, లక్ష్మీ లు వచ్చారు, ఆ తర్వాత ఈ టాక్ షో కు నాచురల్ స్టార్ నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, ఎస్ ఎస్ రాజమౌళి, దగ్గుబాటి రానా ఇలా చాలామంది ఈ షో కు గెస్ట్ లుగా వచ్చారు. ఇది ఇలా ఉంటే ఆన్ స్టాపబుల్ టాక్ షో ప్రస్తుతం చివరి దశకు వచ్చేసింది,  ఈ టాక్ షో చివరి ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు సంబంధించిన ఎపిసోడ్ ను ఆహా నిర్వహణ బృందం టెలికాస్ట్ చేయబోతోంది, ఇప్పటికే ఆహా నిర్వహణ బృందం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ను కూడా విడుదల చేసింది.  

 తాజాగా ఆహా నిర్వాహక బృందం ఆన్ స్టాపబుల్ టాక్ షో కు సంబంధించిన ఒక మాస్ ప్రోమో ను  విడుదల చేసింది,  ఈ ప్రోమో లో పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మి లతో.. బాలకృష్ణ ముచ్చటిస్తున్నాడు. అందులో భాగంగా బాలకృష్ణ ఈ ముగ్గురికి కొబ్బరి బొండాలను కొట్టి ఇచ్చాడు,  అది మాత్రమే కాకుండా బాలకృష్ణ కత్తిని గాల్లోకి విసిరేసి ఆ కత్తి గాల్లో ఉండగానే పట్టుకున్నాడు,  బాలకృష్ణ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ ఛార్మి నలుగురు కలిసి  ఈ కొబ్బరి బోండాలు చెస్ చెప్పుకొని మరి తాగారు.  ఇది ఇలా ఉంటే చార్మి బ్యాంకాక్ లో ఈ కొబ్బరి బొండాలలో వోడ్కా కలిపి ఇస్తారు అని చెప్పగా... బాలకృష్ణ అవన్నీ చేసే ఇక్కడికి వచ్చాము అని సరదాగా ఆన్సర్ ఇచ్చాడు, ప్రస్తుతం ఆన్ స్టాపబుల్ టాక్ షో కు సంబంధించిన ఈ మాస్ ప్రోమోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: