మెగా హీరో రామ్ చరణ్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పాలి.మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలనీ చిత్రయూనిట్ అభిప్రాయ పడుతున్నారు.. ఈ సినిమా షూటింగ్ లో వుండగానే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా లో కీలక పాత్రలో నటించాడు. ఆ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమాను లైన్ లో పెట్టాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ పాన్ ఇండియా సినిమాగా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై తెరకెక్కుతోన్న 50వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఓ షెడ్యూల్ ను పూర్తీ చేసినట్లు తెలుస్తుంది. పూణే లో నిర్వహించిన షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించారు. ఆ తరువాత కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ పనులను మొదలు పెట్టారు.


కొత్త షెడ్యూల్ ను రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. ఇక్కడ కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను, ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నారు.. అక్కడ పల్లె లో కొన్ని ఫైట్ సీన్లు పూర్తీ చెయాలనె ఆలోచన లో ఉన్నారు. ఈ షెడ్యూల్ కు కియరా రాదని తెలుస్తుంది. రామ్ చరణ్ తో పాటు అంజలి, శ్రీకాంత్ లాంటి నటులు ఈ షూటింగ్ లో పాల్గొనున్నారు. ఫిబ్రవరి 10న ఈ షెడ్యూల్ ను మొదలుపెట్టి, ఫిబ్రవరి 28 వరకు షూటింగ్ పూర్తీ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది..తమన్ సంగీతం అందిస్తున్నారు. జయరామ్‌, నవీన్ చంద్ర, సునీల్‌ లాంటి నటులు కీలకపాత్రల్లో నటిస్తూన్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: