మన టాలీవుడ్ హీరోలు ఇప్పుడు నటనకు మాత్రమే పరిమితం కావడం లేదు. మిగిలిన విభాగాల్లో కూడా తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో కొంతమంది హీరోలు నిర్మాణ రంగంలోకి అడుగుపెడితే.. మరికొంత మంది హీరోలు మాత్రం సొంతంగా కథలు రాసుకుంటున్నారు. అంతేకాదు వాటిని డైరెక్ట్ చేసి మరి హిట్లు అందుకుంటున్నారు. ఇప్పటికే టాలెంటెడ్ హీరో అడవి శేషు, కిరణ్ అబ్బవరం వంటి యువ హీరోలు తమ సినిమాలకు తామే కథ, స్క్రీన్ ప్లే  రాసుకుంటున్నారు. ఆ సినిమాలతో హిట్స్ కొడుతున్నారు. ఇక విశ్వక్ సేన్ కూడా ఇటీవల ఫలక్ నామా దాస్ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 

అయితే ఇప్పుడు ఇదే బాటలో మరో స్టార్ హీరో కూడా తన టాలెంట్ ని చూపించబోతున్నాడు. ఆ స్టార్ హీరో ఏకంగా రచయితగా మారి ఒక స్క్రిప్ట్ రాస్తున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు తాజాగా పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప సక్సెస్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్న బన్నీ త్వరలోనే రచయితగా మారి ఒక కథను రాయబోతున్నాడట. అంతేకాదు మొత్తం కొత్తవాళ్లతో గీత ఆర్ట్స్2 బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

త్వరలోనే ఇందుకు సంబంధించి బన్నీ పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరి కొద్ది రోజుల వరకు వేచి చూడాల్సిందే. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా హిందీలో 100 కోట్ల మార్క్ అందుకుని సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా థియేటర్లో ఇంకా స్టడీగానే కలెక్షన్స్ సాధిస్తోంది ఈ సినిమా. ఇక ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు బన్నీ. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్టును బ్యాంక్ రోల్ చేస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: