తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది కథానాయకులు వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వస్తున్న కథానాయకులు అందరూ ఎక్కువగా మోడలింగ్ వైపు నుంచో.. అందాల పోటీ నుంచే వచ్చిన వారే ఉన్నారు. ప్రస్తుతం ఈ కేటగిరికి చెందినదే హీరోయిన్ నేహా శెట్టి.. ఇక ఈమె మిస్ ఇండియా పోటీల్లో సౌత్ నుంచి పాల్గొని 2015 వ సంవత్సరం లో మిస్ సౌత్ ఇండియా రన్నరప్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత శాండిల్ వుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ.ప్రస్తుతం తెలుగులో కూడా తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది.


ఇక తాజాగా డీజే టిల్లు లో హీరో సిద్ధూ సరసన నేహా నటిస్తోంది.ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. అందులో  ముద్దు గుమ్మ నేహా శెట్టి ఘాటైన లిప్ లాక్ లతో కుర్రకారును బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక ఈమె తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకోవాలంటే కచ్చితంగా డిజె టిల్లు మూవీ సక్సెస్ కావాల్సిందే.ఎంత అందం ఉన్నప్పటికీ సక్సెస్ అయ్యారంటే చాలు తమ పేరు బాగా పాపులర్ అవుతూ ఉంటుంది. ఇక ఈ సినిమా ఈ నెల 11వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇక ఈ సినిమా ప్రచారాన్ని కూడా చిత్రబృందం చాలా వేగవంతంగా చేస్తోంది.. ఇక ఇందులోని భాగంగానే ఒక పాటను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ పాటలో హీరోయిన్ నేహా శెట్టి.. లుక్స్, అందం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ట్లుగా సమాచారం. ఈ సినిమాకి అనిరుధ్ పాటలను అందించాడు.సినిమా విడుదలైన తర్వాత మరి కొన్ని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని చిత్రబృందం మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారట. ఇక ఇందులో యాక్టర్ బ్రహ్మాజీ, ప్రగతి, తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: