పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ సినిమాతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు హరీష్ శంకర్. అంతకముందు రవితేజతో తీసిన షాక్ మూవీతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన హరీష్, ఆ తరువాత రవితేజతోనే మరోసారి తీసిన మిరపకాయ్ మూవీతో కెరీర్ పరంగా ఫస్ట్ సక్సెస్ అందుకున్నారు. అనంతరం పలు సినిమాలు చేసిన హరీష్ శంకర్ త్వరలో మరొక్కసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా తీయనున్నారు.

ఇక పలు సినిమాల్లో యాక్టర్ గా అలానే స్క్రీన్ రైటర్ గా పని చేసిన బివిఎస్ రవి, తొలిసారిగా గోపీచంద్ తో వాంటెడ్ సినిమా తీసి పరాజయం అందుకున్నారు. అనంతరం సాయి ధరమ్ తేజ్ తో జవాన్ సినిమా తీసి బాగానే పేరు అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆహాలో ప్రసారం అవుతున్న బాలయ్య అన్ స్టాపబుల్ షో కి రైటర్ గా కూడా పని చేసి బాగా క్రేజ్ దక్కించుకున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఈ ఇద్దరు దర్శకుల సోషల్ మీడియా ట్వీట్స్ వార్ విపరీతంగా వైరల్ అవుతోంది.

ఒకింత పరోక్షంగా ఏపీ ప్రభుత్వం పై సెటైర్లు వేసిన బివిఎస్ రవి, 'నేడు అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయo చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది' అంటూ పోస్ట్ చేసారు. అయితే దానికి స్పందించిన హరీష్ శంకర్, అనుభవించమని ఇచ్చారా అంటూ రవికి రిప్లై ఇచ్చారు. ఆ విధంగా ప్రారంభం అయిన వీరిద్దరి ట్వీట్స్ వార్, అంతకంతకు చిలికి చిలికి గాలివానలా మారింది. అటు హరీష్ త్వరలో పవన్ తో తీస్తున్న భవదీయుడు భగత్ సింగ్ తాలూకు మ్యాటర్ తో పాటు రవి పని చేసిన అన్ స్టాపబుల్ వంటి పదాలతో పాటు ఎదవతనం, పిరికితనం, వేషాలేస్తున్నావ్ వంటి పదాలతో కొనసాగింది. దానితో ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్ వార్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా దీనిలో హరీష్ ని సమర్థిస్తుండగా మరికొందరు రవిని సమర్ధిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: