మాస్ మహారాజ రవితేజ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఖిలాడీ. యువ భామలు డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని పెన్ మూవీస్, ఏ స్టూడియోస్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందించారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ అన్ని ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

రవితేజ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తుండగా మెయిన్ విలన్ పాత్రలో సీనియర్ యాక్టర్ అర్జున్ షార్జా కనిపించనున్నట్లు టాక్. ఇక ఈ మూవీ పై ప్రారంభం నుండి అటు రవితేజ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా బాగానే అంచనాలు ఉన్నాయి. మంచి థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా భారీ యాక్షన్, కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకడు రమేష్ వర్మ తీసిన ఈ ఖిలాడీ తప్పకుండా పెద్ద సక్సెస్ కొడుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక మరొక రెండు  రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నేడు సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుని యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది.

మొత్తంగా 2 గంటల 34 నిమిషాల పాటు సాగె ఖిలాడీ మూవీ చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు మూవీ పై మంచి ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. సినిమాలో అనేక ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నాయని, హీరోగా రవితేజ అద్భుతమైన యాక్టింగ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ కానుండగా, ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ సినిమాలో పెద్ద హైలైట్ గా నిలవడం ఖాయం అని, గ్రాండియర్ ఫోటోగ్రఫితో పాటు దేవి అందించిన సాంగ్స్ స్క్రీన్ పై అదిరిపోయాయని, ఇక యాక్షన్ సీన్స్, ఫైట్స్ కూడా ఆకట్టుకున్నట్లు వారు తెలిపారట. మొత్తంగా ఈ ఖిలాడీ మూవీతో మాస్ రాజా రవితేజ మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నట్లే ని టీమ్ కి ప్రత్యేకంగా యూనిట్ కి ముందస్తుగా అభినందనలు తెలిపారట సెన్సార్ సభ్యులు. మరి రేపు రిలీజ్ తరువాత ఖిలాడీ ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: