టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇంకా విదేశాల్లో కూడా మహేష్ బాబుకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సినిమా సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబుకు క్రేజ్ అనేది పెరిగిపోతుంది. ఇక ప్రస్తుతం ఈ స్టార్ హీరో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ఏడాది మే నెల 12వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.అయితే గతంతో పోలిస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా మారారని మహేష్ బాబు అభిమానులు ఇంకా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా టాక్ షోలలో ఇంకా గేమ్ షోలలో పాల్గొనటానికి మహేష్ బాబు అస్సలు ఇష్టపడరు. అయితే సూపర్ స్టార్ మహేష్ ఎవరు మీలో కోటీశ్వరులు షోతో పాటు అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొని బాగా సందడి చేయడం గమనార్హం.

అలాగే మరోవైపు తాజాగా జగన్ తో జరిగిన సమావేశానికి కూడా మహేష్ హాజరయ్యారు. మహేష్ బాబు తండ్రి కృష్ణ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉండేవారు.ఆ తర్వాత కాలంలో కృష్ణ రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ టీడీపీలో ఉన్నా ఆ పార్టీ తరపున సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ కూడా ప్రచారం చేయలేదనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీడియాతో కూడా మాట్లాడారు.సూపర్ స్టార్ మహేష్ బాబులో వచ్చిన ఈ మార్పును చూసి ఆయన అభిమానులు సైతం తెగ ఆశ్చర్యపోతున్నారు. వివాదాలకు దూరంగా ఉండే మహేష్ అన్ని విషయాల్లో కూడా ఇంత యాక్టివ్ గా ఉండటంతో పాటు బుల్లితెరపై ఇంకా ఓటీటీలలో సందడి చేస్తుండటం సో టోటల్ గా మహేష్ చేంజ్ ఓవర్ కు ఆయన అభిమానులు ఫుల్ ఫిదా అయ్యి ఎంతో ఆనందంగా వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: