కొంతమంది యువ హీరోలు ఇప్పుడు ప్రతినాయకుడి పాత్రలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆవిధంగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన హీరో ఆది పినిశెట్టి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను తన విలనిజంతో ఎంతగానో ఆకట్టుకోబోతున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమా లో భారీ స్థాయిలో నటించి అలరించిన ఈ హీరో ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. రామ్ హీరోగా ది వారియర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

 యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చుట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్ నటించిన రెడ్ సినిమా ప్రేక్షకుల నుంచి ఆశించిన ఫలితం లేకపోవడంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు రామ్. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించి తనకు మంచి పేరు తీసుకురావాలని ఆయన భావిస్తున్నాడు. అలా ఈ సినిమాలో ప్రధాన విలన్ గా నటిస్తున్న ఆది పినిశెట్టి లుక్ విడుదల చేయగా ఇందులో క్రూరం గా కనిపించడం వంటివి చూస్తుం ఆది పినిశెట్టి పాత్ర ఈ సినిమా ఎంతో కీలకంగా ఉండబోతుంది అని చెప్పవచ్చు.

సరైనోడు సినిమాలో ఎంతో క్లాస్ విలన్ గా కనిపించిన ఈ హీరో ఈ సినిమాలో క్రూరమైన విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే సినిమా బృందం విడుదల చేయనుంది. తమిళ తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై రెండు భాషల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా ఈ ఎంతో కీలకమైన నేపథ్యంలో వీరికి ఈ సినిమా తీసుకు వస్తుందో తీసుకు వస్తుందో చూడాలి. ఇకపోతే రామ తన తదుపరి సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా కూడా మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన సినిమా అని ఈ విధంగా వరుసగా దర్శకులతో సినిమాలు చేస్తూ తన స్టామినాను పెంచుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: