సూపర్ స్టార్ మహేష్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లేటెస్ట్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇటు నార్మల్ ఆడియన్స్ సైతం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గతంలో మహేష్ తో త్రివిక్రమ్ తీసిన రెండు సినిమాలైన అతడు, ఖలేజా ఆ విధంగా ఆడియన్స్ లో మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసాయి. వాస్తవానికి వాటిలో అతడు సూపర్ హిట్ కొట్టగా ఖలేజా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.

అయినప్పటికీ కూడా ఈ రెండు సినిమాలు కూడా కల్ట్ క్లాసిక్స్ గా ఇప్పటికీ టివి లో ప్రసారం అయితే చాలు బాగానే రేటింగ్స్ ని సంపాదిస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక త్వరలో మహేష్, త్రివిక్రమ్ చేస్తున్న మూవీ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రాక్ స్టార్ థమన్ మూడు సాంగ్స్ ట్యూన్స్ సిద్ధం చేసారని, అలానే సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో సాగుతూ ఉండడంతో పాటు సినిమా కోసం పలు భారీ సెట్టింగ్స్ కూడా వేగంగా సిద్ధం అవుతున్నాయట, అలానే ఇంకోవైపు ప్రొడక్షన్ టీమ్ సినిమా కోసం పలు ముఖ్య ప్రాంతాల్లో లొకేషన్స్ ని కూడా వెతుకుతున్నారట.

ఆ విధంగా మహేష్, త్రివిక్రమ్ గ్రాండ్ మూవీకి సంబంధించి ఇన్నర్ గా ఈ గ్రౌండ్ వర్క్ పనులు జరుగుతున్నాయని, ప్రస్తుతం సర్కారు వారి పాట చివరి దశ షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్ బాబు, పక్కాగా ఏప్రిల్ మొదటి వారంలో త్రివిక్రమ్ మూవీ షూట్ లో జాయిన్ అవుతారని అంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ యాక్షన్, ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ ని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా, మది ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: