మహేష్ బాబు సరిలెరు నీకెవ్వరు సినిమా సక్సెస్ తో వరుస సినిమాలకు సైన్ చేశాడు. ఆ సినిమాలలొ ముందుగా సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తూన్నారు. గీతా గోవిందం ఫెమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కార్ వారి పాట. భారీ అంచనాల మధ్య బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది..మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 12న గ్రాండ్‌గా విడుదల కానుంది.


ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లు, కళావతి సాంగ్ విడుదల అయ్యాయి .అవి మహేష్ అభిమానులతో పాటుగా సినీ ప్రెక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి.. సాంగ్ మంచి వ్యూస్ ను రాబట్టడంతో సినిమా పై అంచనాలను పెంచుతుంది. ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నారు... మొత్తానికి మహేష్ బాబు కు ఈ సినిమా కూడా హిట్ టాక్ ను అందిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి..


ఇది ఇలా ఉండగా.. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా జక్కన్న సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.. మహేష్‌ బాబు - రాజమౌళి కలయికలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' అనంతరం రాజమౌళి పట్టాలెక్కించే భారీ ప్రాజెక్ట్‌ ఇదే. ఈ చిత్రంలో హీరోయిన్ గా అలియాని ఎంపిక చెసుకున్నారని తెలుస్తోంది. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'లో అలియా నటన, ఆమె అంకితభావం రాజమౌళి ఫిదా అయ్యారు, అందుకే మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి మహేష్‌బాబు చిత్రానికి సంబంధించిన స్ర్కిప్టు పనులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఎన్టీఆర్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకునే చిత్రంలో అలియానే కథానాయికగా ఎంచుకున్నారని తెలుస్తుంది. రెండు సినిమాలను అలియాచెయనుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: