సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు,  అలాంటి వారిలో కొంత మంది మాత్రం అతి తక్కువ కాలం లోనే ఫుల్ క్రేజ్ ను సంపాదించు కుంటూ ఉంటారు,  వారు నటించిన సినిమాలు  బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మలు  మాత్రం ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని వరుస సినిమా ఆఫర్ లను కూడా దక్కించుకుంటారు,  అలా ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో ఏ సినిమా  బ్లాక్ బస్టర్ కాకపోయినప్పటికీ ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని వరుస మూవీ  అవకాశాలను దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ లలో మాళవిక మోహనన్ ఒకరు. అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహనన్,  సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పేట సినిమాతో ప్రేక్షకులను పలకరించింది,  ఈ సినిమా  ఈ ముద్దుగుమ్మ ఆశించిన సక్సెస్ ను అందుకోలేకపోయింది.

 ఆ తర్వాత మాళవికా మోహనన్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో కథానాయికగా నటించింది, ఈ సినిమా కు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు.   ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడం తో పాటు ఈ ముద్దుగుమ్మ కు  టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఫుల్ క్రేజ్ ను  తీసుకు వచ్చింది.  మాస్టర్ సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న మాళవిక మోహనన్ ప్రస్తుతం ధనుష్ హీరోగా తెరకెక్కిన మారన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది,  ఈ సినిమా ఈ నెల 11 వ తేదీన విడుదల కాబోతుంది.  ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న మాళవిక మోహనన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది,  ఈ ఇంటర్వ్యూ లో భాగంగా మాలవిక మోహనన్ మాట్లాడుతూ...  బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బయోపిక్ తీస్తే.. అందులో తను ఆమె పాత్ర లో నటించాలని ఉందని మాళవిక మోహనన్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: