డార్లింగ్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భర్తీ వ్యయంతో తెరకెక్కిన రాధేశ్యామ్ పై అందరిలో మొదటి నుండి ఎంతో భారీ స్థాయి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఈ సినిమాలో విక్రమాదిత్య అనే హస్త సాముద్రిక నిపుణుడి పాత్ర చేస్తుండగా ప్రేరణగా కనిపించారు అందాల హీరోయిన్ పూజా హెగ్డే.

భారీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన రాధేశ్యామ్ లో భాగ్యశ్రీ, కృష్ణంరాజు, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, మురళీశర్మ, షాషా ఛత్రి తదితరులు కీలక పాత్రలు చేయగా సౌత్ వెర్షన్స్ కి జస్టిన్ ప్రభాకరన్, అలానే హిందీ వర్షన్ కి మన్నన్ మిథూన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, టీజర్స్, సాంగ్స్ అన్ని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. మొత్తంగా ఎప్పటి నుండో అందరినీ ఊరిస్తూ వస్తున్న రాధేశ్యామ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ విదేశాల్లో చూసిన ప్రేక్షకులు మూవీ బాగుందని, రొమాంటిక్ లవ్ స్టోరీ తోపాటు పలు ఎమోషనల్ అంశాలను కలగలిపి దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాని తెరకెక్కించినట్లు చెప్తున్నారు. సినిమాలో హీరో, హీరోయిన్స్ పెయిర్ బాగుందని, భారీ విజువల్స్, గ్రాండియర్ ఫోటోగ్రఫి, థమన్ బీజీఎమ్, జస్టిన్ సాంగ్స్ రాధేశ్యామ్ కి ప్లస్ పాయింట్స్ అని, అయితే ఈ మూవీ మాస్ వర్గాల్లో, మరీ ముఖ్యంగా బి, సి ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుంది అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం అంటున్నారు. మరోవైపు ఈ సినిమా తొలి రోజు భారీ ఓపెనింగ్స్ దక్కించుకోవడంతో రాధేశ్యామ్ యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. మరి మన డార్లింగ్ ప్రభాస్ ఈ రాధేశ్యామ్ మూవీ తో ఇకపై ఆడియన్స్ ని ఎంతవరకు థియేటర్స్ కి రప్పిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: