పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ ఎంతో భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. యువ దర్శకుడు రాధాకృష్ణ తీసిన ఈ రొమాంటిక్ లవ్ ఎమోషనల్ మూవీకి మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి అందించగా పలువురు టాలీవుడ్ తో పాటు ఇతర భాషలకు చెందిన ముఖ్య నటులు ఇందులో కీలక పాత్రలు చేసారు. కాగా ఈ సినిమాలో విక్రమాదిత్య అనే హస్త సాముద్రిక నిపుణుడిగా ప్రభాస్ యాక్ట్ చేయగా, ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే కనిపించారు.

ప్రారంభం నాటి నుండి అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన రాధేశ్యామ్ పై డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే మరింతగా అంచనాలు ఉన్నాయి. మరోవైపు రాధేశ్యామ్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని అందరినీ ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. మొత్తంగా పలుమార్లు వాయిదా పడ్డ రాధేశ్యామ్ ఎట్టకేలకు నేడు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందు వచ్చి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. విక్రమాదిత్య గా ప్రభాస్, ప్రేరణ గా పూజా హెగ్డే ఇద్దరూ కూడా యాక్టింగ్ అదరగొట్టారని, అలానే ఇతర పాత్రధారులు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి యాక్ట్ చేసారని పలువురు ప్రేక్షకులు అంటున్నారు.

దర్శకుడు రాధాకృష్ణ ఈ మూవీని క్లాసిక్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన తీరు బాగున్నప్పటికీ ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుంది అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం అంటున్నారు. బహుబాలి సినిమాలతో పెద్ద స్టార్ గా భారీ మాస్ ఇమేజ్ ని సైతం సొంతం చేసుకున్న ప్రభాస్ తొలిసారిగా ఇటువంటి లవ్ స్టోరీ మూవీ చేయడంతో ముఖ్యంగా కొన్ని చోట్ల ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. మరి రేపటి నుండి ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్ ని మెప్పిస్తుందో, ఏ స్థాయి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: