అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా ,  అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం లో నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి విజయాన్ని అలాగే మంచి గుర్తింపును సంపాదించుకున్న రాశి ఖన్నా కు ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి,  అందులో భాగంగా రాశి ఖన్నా నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలు సాధించడంతో ప్రస్తుతం రాశి ఖన్నా టాలీవుడ్ ఇండస్ట్రీ లో  ఉన్న టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది.  ఇది ఇలా ఉంటే  హాట్ బ్యూటీ రాశి ఖన్నా ప్రస్తుతం థాంక్యూ , పక్కా కమర్షియల్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుంది,  ఇలా టాలీవుడ్ లో సినిమా లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య తాజాగా బాలీవుడ్ లో రుద్ర అనే వెబ్ సిరీస్ లో నటించింది.

 ఈ వెబ్ సిరీస్ లో అజయ్ దేవగన్ ఒక ముఖ్య పాత్రలో నటించాడు,  ఇలా రాశి ఖన్నా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే రుద్ర అనే వెబ్ సిరీస్ తో కూడా ప్రేక్షకులను అలరించింది,  ఇది ఇలా ఉంటే రాశి ఖన్నా తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది...  రాశి ఖన్నా తన కెరియర్ తొలి నాళ్లకు సంబంధించిన వివరాలను తెలుపుతూ... నిజానికి నేను కాపీ రైటర్‌ కావాలనుకున్నాను ఇందుకోసం డిగ్రీ పూర్తి చేయగానే అందుకు  సంబంధించిన కోర్సు కూడా చేద్దామనుకున్నా అంతలోనే ‘మద్రాస్‌ కేఫ్‌’ లో ఛాన్స్ వచ్చింది,  ఆ తరువాత అవసరాల శ్రీనివాస్‌ ‘ఊహలు గుసగుసలాడే’ స్క్రిప్ట్‌ తో నన్ను సంప్రదించారు,  దానిని కాదనలేకపోయాను,   ఆ తర్వాత నా ప్రయాణమంతా మీకు తెలిసిందే’ అని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: