మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా.. యాడ్స్‌ లలోనూ తన సత్తా చాటుతూ.. అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు. కాగా, ఇప్పటికే తను నటించిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్ పూర్తి చూసుకోగా.. ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించగా.. ఈ మూవీలో తొలిసారిగా పూర్తిస్థాయిలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటిస్తున్నారు.

సినిమా తర్వాత దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్‌కు రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఇప్పటికే టైటిల్ కూడా ఖరారు చేశారు. దీనికి ‘గాడ్ ఫాదర్’ అని టైటిల్ సెలక్ట్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే సల్మాన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు టాక్. అలాగే దర్శకుడు మోహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ అనే సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత బాబీ, వెంకీ కుడుముల దర్శకులతో సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు కమర్షియల్ యాడ్‌లలో నటిస్తున్నారు చిరంజీవి. ఇప్పటికే థమ్స్ అప్, నవరత్న ఆయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి వ్యవహరించారు. తాజాగా ఒక ప్రముఖ రియల్ ఏస్టేట్ సంస్థ యాడ్‌లో చిరంజీవి నటించారు. ఈ యాడ్ షూట్‌కు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ యాడ్‌లో చిరంజీవితోపాటు ఖుష్బూ, యాంకర్ అనసూయ నటించారు. ఈ యాడ్‌లో చిరంజీవికి భార్యగా ఖుష్బూ నటిస్తుంది. చిరంజీవి రెడీ అయి బయటికి వెళ్తున్నప్పుడు అనసూయ దగ్గర నుంచి ఫోన్ వస్తోంది. దీంతో చిరంజీవి తన ఫ్రెండ్ కాల్ చేశాడని అక్కడి నుంచి హడావిడిగా బయలుదేరుతాడు. దీంతో అనుమానం వచ్చి ఖుష్బూ కూడా చిరంజీవిని ఫాలొ అవుతుంది. చిరంజీవి, అనసూయ కలిసి ఒక రూంలో వెళ్లడం చూసి.. కోపంతో రగిలిపోతుంది ఖుష్బూ. తీరా అక్కడికి వెళ్లాక.. చిరంజీవి ఖుష్బూకి సర్‌ప్రైజ్ ఇస్తారు. ఈ రోజు తన భార్య పుట్టిన రోజు అని.. అందుకే తన కోసం ఇల్లు కొంటున్నానని చెబుతాడు. ఆ మాటలు విన్న ఖుష్బూ ఎమోషనల్‌ అయి చిరంజీవిని హగ్ చేసుకుంటుంది. ఇలా ఈ యాడ్ ఎండ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: