తమిళ నటుడు విజయ్ హీరోగా టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బీస్ట్'. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను ఇప్పటికే విదేశాల్లో భారీగా స్క్రీనింగ్ కు ప్లాన్ చేశారు.ఇక యూఎస్ తో పాటు పలు దేశాల్లో ఈ సినిమాను స్క్రీనింగ్ చేయబోతున్నారు. అయితే ఇండియన్ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలను కూడా అరబిక్ దేశాల్లో ప్రదర్శించాలంటే అక్కడి సెన్సార్ ను దాటాల్సి ఉంటుంది.అందువలన బీస్ట్ సినిమాను అరబిక్ దేశాలు అన్నీ కూడా బ్యాన్ చేస్తున్నారు. టెర్రరిజం నేపథ్యంలో రూపొందిన సినిమా కావడం వల్ల బీస్ట్ ను అక్కడ విడుదల కానిచ్చేది లేదు అంటూ అక్కడి ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఫస్ట్ బీస్ట్ సినిమాను కువైట్ దేశం బ్యాన్ చేసింది. అక్కడ సెన్సార్ బోర్డ్ ముందుకు వెళ్లిన బీస్ట్ సినిమాలో టెర్రరిజం అనే అంశం ఉన్న కారణంగా తమ దేశంలో రిలీజ్ చెయ్యడానికి అనుమతులు ఇవ్వబోం అంటూ ప్రకటించారు.కువైట్ దారిలోనే ఇతర అరబిక్ దేశాలు కూడా ఈ సినిమాని బ్యాన్ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. తాజాగా మరో అరబిక్ దేశం అయిన ఖతార్ దేశం కూడా ఈ సినిమాను బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. 



తమ దేశంలో నెలకొన్న పరిస్థితులకు ఇబ్బంది కలిగించే విధంగా ఈ సినిమాలో కంటెంట్ ఉందంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తూ సినిమా సెన్సార్ కు నిరాకరించినట్లుగా సమాచారం తెలుస్తోంది.ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను భారీగా విడుదల చేసి రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకోవాలనుకున్న మేకర్స్ కు నిరాశ అనేది తప్పలేదనే చెప్పాలి. అయితే యూఎస్ లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా విడుదల కాబోతుంది. మరి కాసేపట్లో అక్కడ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు అనేవి భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా కు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగడంతో అంచనాలు భారీగా పెరిగాయి.ఇక నెల్సన్ దిలీప్ గత సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా కాన్సెప్ట్ పరంగా కూడా చాలా విభిన్నంగా ఉంటాయని టాక్ దక్కించుకున్నాయి. అందుకే ఈ సినిమా ను కూడా భారీ ఎత్తున తమిళ ప్రేక్షకులు చూసేందుకు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: